15 April, 2026 | 12:05 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

30-01-2026 01:39 AM

మంచిర్యాల, జనవరి 29 (విజయక్రాంతి) : మంచిర్యాల సమీప గోదావరి నదీ తీరం భక్తజనసంద్రమైంది. గద్దెలకు సమ్మక్క చేరడంతో పెద్ద మొ త్తంలో భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల ప్లై ఓవర్ బ్రిడ్జి నుంచి గోదావరి వరకు రోడ్డంతా సందడిగా మారింది. డప్పు వాయిద్యాలతో కన్నుల పండుగగా సమ్మక్క తల్లిని ఊరేగింపుగా గౌతమేశ్వర ఆలయ ప్రాంగణం వరకు తీసుకు రాగా అధిక సంఖ్యలో భక్తులు పూనకాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గోదావరి నది తీరం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. అమ్మవార్లను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, మంచిర్యాల మరింతగా అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.