30-01-2026 01:41:37 AM
నిర్మల్, జనవరి ౨౯ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలం గుండంపెల్లిలో కొలువైన శ్రీశ్రీ శ్రీదేవి భూదేవి ఆలయ వార్షికో త్సవం గురువారం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞం ఉత్సవ ర్యాలీ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.