2 July, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

ప్రతి కాలనీలో రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తాం

05-09-2025 10:00 PM

వడ్డేపల్లి,(విజయక్రాంతి): శంకుస్థాపన చేసిన నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రారంభోత్సవం కూడా చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని వరంగల్ పశ్చిమ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వారు కాజీపేటలోని అంబేద్కర్ కాలనీలో సుమారు 90 లక్షలతో 61వ, 62వ, 63వ డివిజన్లకు సంబంధించిన అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన 21 నెలల కాలంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలంలో చాలా ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం నుంచి కాపాడుకోగలిగామన్నారు.

నియోజవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు సహకారం అందిస్తున్న ప్రజలకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ప్రధాన కాలనీలను అత్యవసర రోడ్లను నిర్మాణం చేపట్టుకొని గత పాలకుల ప్రభుత్వాల చేతుల్లో అభివృద్ధికి నోచుకుని చాలా కాలనీలను కూడా అభివృద్ధి చేసుకున్నమని తెలిపారు. అంతకు ముందు అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.