2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులు

05-09-2025 09:55 PM

ఉత్తమ గురువులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం

మణుగూరు,(విజయక్రాంతి): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  కొనియాడారు. ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా  శుక్రవారం విద్యాశాఖ, వాసవీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జడ్పీ కో-ఎడ్యుకేషన్  పాఠశాలలో  జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ... దేశంలో ఎంతోమంది ఉపాధ్యాయులు అనేక గొప్ప పదవులను అధి రోహించిన వారున్నారని, అందులో సర్వేపల్లి రాధాకృష్ణ ముఖ్యులని తెలిపారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.