10-09-2025 12:16:56 AM
చేగుంట, సెప్టెంబర్ 9 :చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇబ్రహీంపూర్ లో ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం అందించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, మంచిగట్ల శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.