11-02-2025 12:00:00 AM
చేగుంట, ఫిబ్రవరి 10: చేగుంట మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ సాయి బాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు, అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.