7 April, 2026 | 5:09 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

మోదీ కాల్ చేయలేదు!

10-01-2026 01:48 AM
  1. అందుకే వాణిజ్య ఒప్పందం నిలిచింది..
  2. అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత్ -అమెరికా మధ్య జరగాల్సిన కీలక వాణిజ్య ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేయకపోవడం వల్లనే నిలిచిపోయాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఆరోపణలు చేశారు.

మోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కాల్ చేయాల్సి ఉందని, కానీ.. భారత ప్రధాని మోదీ పని చేయలేదని పేర్కొన్నారు. తమ దేశం విధించిన గడువు లోపు భారత ప్రధాని స్పందించకపోవడం వల్లే వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు రేసులో ముందుకు వెళ్లాయని పేర్కొన్నారు. భారత ఉత్పత్తులపై గతేడాది తమ దేశం 50 శాతం సుంకం విధించడానికి ఈ ఫోన్ కాల్ వ్యవహారమే ప్రధాన కారణమని తేల్చిచెప్పారు.