14 July, 2026 | 4:43 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

భారత్ అమ్ములపొదిలోకి మరిన్ని ఆయుధాలు

30-12-2025 12:00 AM
  1. ఆయుధ కొనుగోలుకు రూ.79 వేల కోట్లు
  2. డీఏసీ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౯: భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో సోమవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)లో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తాజాగా నిర్ణయంతో మూడు సాయుధ దళాల అమ్ములపొదిలోకి అత్యంత శక్తిమంతమైన అత్యాధునిక సాంకేతిక పరికరాలు, క్షిపణులు సమకూరనున్నాయి. నిఘా వ్యవస్థల పనితనం మరింత మెరుగుపడనుంది.