18-08-2025 02:02:06 AM
అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఆదివారం భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖాగుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణ్ ఆయనకు స్వాగతం పలికారు.