31 August, 2026 | 6:38 PM

Breaking News

సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి   •   లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •   మాజీ ఎంపీపీను పరామర్శించిన ముత్తారం కళాశాల అధ్యాపకులు   •  

గణనాథులను దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

01-09-2025 01:16 AM

మేడ్చల్, ఆగస్టు 31(విజయ క్రాంతి):  మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో గణనాథులను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లిలోని అపర్ణ కాలనీ, మారి గోల్ అపార్ట్మెంట్, తులిప్ గ్రేటర్ కమ్యూనిటీలో, ఎల్లో బెల్స్ అపార్ట్మెంట్లో అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున గణనాథులను ప్రతిష్టించి పూజలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, గొల్ల పోచంపల్లి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, అమరం మోహన్ రెడ్డి, శ్రీనివాస్, విజిత్, శ్రీధర్, శివాజీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.