6 May, 2026 | 9:36 PM

Breaking News

కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •  

తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా

16-09-2025 12:04 AM

రామచంద్రాపురం, సెప్టెంబర్ 15 :ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్ దారులందరికీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, అయితే ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు, చేయూత పొందుతున్న పెన్షనుదారులు, ఒంటరి మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. వెంటనే పింఛన్లను పెంచి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎమ్మార్పీఎస్ నాయకులు, వికలాంగులు, పెన్షనుదారులు, మహిళలు పాల్గొన్నారు.