17-05-2025 08:44:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణంలోని సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్ముతున్నటువంటి షాప్ లకు జరిమానాలు విధించడం జరిగింది. శనివారం నిర్మల్ పట్టణంలోని పలు దుకాణాలను తరలించేసి జరినామ విధించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... పట్టణంలోని ప్రజలు ప్లాస్టిక్ వాడకూడదని, బట్ట సంచులు వాడి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.