23-04-2025 10:26:45 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో కన్వీనర్ మొహమ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ ఫరీద్, మొహమ్మద్ ఫజల్, ముఫ్టీ ఆలం గీర్ సాబ్, సయ్యద్ ఆదిల్, బుల్లెట్ ఇమాం, మోసిన్, మౌలానా సాజిద్ ఇమాముద్దీన్, సయీద్, గయాజ్, అష్రఫ్, ఫాజిల్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.