15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

10-11-2025 12:22 AM

ఎస్సు బొజ్జ మహేష్ 

ఎల్లారెడ్డి, నవంబర్ 9 (విజయ క్రాంతి): విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి ఎస్‌ఐ బొజ్జ మహేష్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సి బాలికల వసతి గృహంలో నేషనల్ లీగల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సు మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా కష్టపడి చదవడంతో పాటు న్యాయ సలహాలు, సూచనలు పాటించడంతోపాటు తమ చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులకు బంధువులకు న్యాయ వ్యవస్థపై చట్టాల పై అవగాహన కల్పించాలన్నారు.

మున్సిప్కోట్ న్యాయవాది పద్మ పండరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఉన్నత లక్ష్యాలు నేర్పరచుకొని జీవితంలో స్థిరపడే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు, విద్యార్థినీలు, వసతి గృహ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.