23-08-2025 02:24:53 PM
సిద్దిపేట క్రైమ్: విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్(AR Additional DCP Subhash Chandra Bose) అన్నారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ను ఏఆర్ అడిషనల్ డీసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీక్లీ పరేడ్ వల్ల సిబ్బంది ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవచ్చన్నారు. తీరిక దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పూర్ణచందర్ ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, రాజేష్, కార్తీక్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, ప్రవీణ్ కుమార్, అంజయ్య, శ్రీధర్, మరియు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిద్దిపేట డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.