23-08-2025 05:21:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఖరీఫ్ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు యూరియా కాంప్లెక్స్ ఎరువులు దొరకకపోవడంతో పంట కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వెంటనే యూరియాను డీఏపీలను జిల్లాకు సరఫరా చేయాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్ వినోద్ కార్యకర్తలు ఉన్నారు.