17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యాడి బాపుగఢ్‌లో నాగసాధువుల పూజలు

10-01-2026 03:05 PM

ఆలయ ధర్మకర్తలకు ఆశీర్వదించిన నాగ సాధువులు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ యాడి బాపూ గడ్ లో శనివారం నాగ సాధువులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ చెందిన నాగ సాధువులు యాడి బాపు గడ్ లో వెలసిన శ్రీ మావురాల ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న సద్గురు శ్రీ సంత సేవాలాల్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించి వివరాలను ఆలయ ధర్మకర్తలైన 

శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్, శాంతాదేవిలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ధర్మకర్తలకు నాగ సాధువులు నూతన వస్త్రాలను అందించి..రానున్న రోజుల్లో యాడికి బాపు గడ్ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆశీర్వదించారు.