15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సమస్యల పరిష్కరించాలి

10-01-2026 03:31 PM

ఎంపీ నగేష్ ను కలిసిన జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్

కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ ను శనివారం ఆయన నివాసంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. కెరమెరి మండలంలోని ఉమ్రి క్రాస్ రోడ్ నుంచి పరంధోలి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే పరంధోలి, ముకదంగూడ గ్రామపంచాయతీలకు త్రీఫేస్ విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ లొద్ది, మహారాజ్ గూడ గ్రామాల్లో ఎదురవుతున్న మొబైల్ సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్లు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.