3 July, 2026 | 10:22 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నీరజ్ టీ అరుదైన గౌరవం

15-12-2024 12:27 AM

ప్రపంచ అథ్లెటిక్స్ హెరిటేజ్ కలెక్షన్‌లో చోటు

మొనాకొ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ ధరించిన టీ ప్రపంచ అథ్లెటిక్స్ హెరిటేజ్ కలెక్షన్‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం నీరజ్ టీ మ్యుజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్‌వోడబ్ల్యూఏ)లో ఆన్‌లైన్ త్రీడీ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శనలో ఉంచారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు ప్రదర్శనతో రజతం సొంతం చేసుకున్నాడు.

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో బరిసెను 89.45 మీటర్ల దూరం విసిరి ఒలింపిక్ కెరీర్ బెస్ట్ సాధించాడు. అయితే పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు) ఒలింపిక్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. అయితే అథ్లెటిక్స్ విభాగంలో వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకాలు కొల్లగొట్టిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్ రికార్డులకెక్కాడు.