3 July, 2026 | 11:12 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

వరుణుడిదే ఆధిపత్యం

15-12-2024 12:24 AM

భారత్, ఆసీస్ మూడో టెస్టు

బ్రిస్బేన్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదలైన మూడో టెస్టు తొలి రోజు వరుణుడు ఆధిపత్యం ప్రదర్శించాడు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఏంచుకుంది.అయితే వర్షంతో కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

ఉస్మాన్ ఖవాజా (19*), మెక్‌స్వీనీ (4*) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి అంతరాయం కలిగించిన వరుణుడు ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఊపందుకున్నాడు. ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.  ఇక తొలిరోజు మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులకు టికెట్ డబ్బులు రీఫండ్ చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.