28 June, 2026 | 3:45 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

02-01-2026 12:52 AM

జిష్ణుదేవ్‌వర్మను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం లోక్‌భవన్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు కాసేపు చర్చించికున్నట్లు సమాచా రం. గవర్నర్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శిశధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదేవి ధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రు లు, అధికారులు, పార్టీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, సీఎస్ రా మకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పార్టీ నా యకులు రేవంత్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.