16 March, 2026 | 2:53 PM

Breaking News

మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •   విద్యుత్ సరఫరాలో అంతరాయం   •  

గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

02-01-2026 12:52 AM

జిష్ణుదేవ్‌వర్మను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం లోక్‌భవన్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు కాసేపు చర్చించికున్నట్లు సమాచా రం. గవర్నర్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శిశధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదేవి ధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రు లు, అధికారులు, పార్టీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, సీఎస్ రా మకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పార్టీ నా యకులు రేవంత్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.