22-11-2025 01:58:52 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 21(విజయ క్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా నిఖిత పంత్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఆయా స్థానాలకు బదిలీ చేయగా నిఖిత పంత్ను జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కాంతిలాల్ పాటిల్ ఈ ఏడాది 3 జూన్ న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 6 నెలలపాటు జిల్లా పోలీస్ అధికారిగా పనిచేశారు.