09-05-2025 12:45:33 AM
నిజామాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయిలో జరిగిన వార్షిక రుణ ప్రణాళిక స్వయం సహాయక సంఘాలకు అత్యధికంగా రుణం మంజూరు చేసిన ఘనత నిజామాబాద్ జిల్లాకు దక్కింది.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రస్థాయిలో జరిగిన వార్షిక రుణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లోన్ల మంజూరీ ఇచ్చి అత్యధిక రుణాలు ఇచ్చిన విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు అవార్డు లభించింది.
ఈ అవార్డును డిఆర్డిఓ, అదనపు డిఆర్డిఓ, జెడ్ ఎస్ అధ్యక్షులు డిపిఎం ఎఫ్ఐ తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా సీఈవో ఎస్ఈఆర్పి చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా అధికారులు అందుకున్నారు.