10 April, 2026 | 2:43 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

రాథోడ్ ఆనంద్ కుమార్ అను నేను..

23-12-2025 02:21 AM

కొలువు దీరిన కొత్త సర్పంచులు.. 

పండగ వాతావరణంలో ప్రమాణ స్వీకారోత్సవాలు... 

తాండూరు, 22 డిసెంబర్, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు కొలువుదీరారు. మండల ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దముల్ మండలం కందనెల్లి తాండ నూతన గ్రామ సర్పంచ్ గా రాథోడ్ ఆనంద్ నాయక్ మరియు ఉప సర్పంచ్ సేవా నాయక్, వార్డు సభ్యుల  చేత ప్రత్యేక అధికారి వినోద్ కుమార్, ప్రమాణ స్వీకారం చేయించారు.

కమ్యూనిటీ భవనాన్ని పచ్చటి తోరణాలతో అలంకరించి పండగ వాతావరణం లో ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు .ఈ సందర్భంగా సర్పంచ్ ఆనంద్ నాయక్ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, యువకులు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి తో పాటు ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను   ఇంటింటికి చేరేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామ కార్యదర్శి నవిత మరియు గ్రామస్తులు యువకులు భారీగా పాల్గొన్నారు.