10 May, 2026 | 12:36 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

ఆన్‌లైన్‌లో ‘మధ్యాహ్న’ బిల్లులు వచ్చే నెల నుంచి చెల్లింపులు

17-09-2025 01:00 AM
  1. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో ప్రారంభం
  2. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన బిల్లులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు. బిల్లు లు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూసే పరిస్థితికి విద్యాశాఖ పుల్‌స్టాప్ పెట్టనుంది. పెద్దపలి, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులను ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం ఆయనను కలిసిన విలేకరులతో తెలిపారు.

ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోందని, ఈ క్రమంలోనే నేరుగా ఆన్‌లైన్ నుంచే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు. అలాగే విద్యార్థులకు అందించే భోజనం (రైస్), రాగిజావ పంపిణీ కేంద్రాల నుంచి పాఠశాలలకు వెళ్తున్నాయా? లేదా? తెలుసు కునేలా ట్రాక్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.