17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అమాయకులను చంపిన ముష్కరులే మా లక్ష్యం

08-05-2025 12:39 AM

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ, మే 7: ‘పహల్గాంలో అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న ముష్కరులనే మట్టుబెట్టాం. మన సైనికులు ఉగ్రశిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నారు.’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడారు. ‘పాకిస్థాన్‌కు మన సైనిక దళాలు గట్టి జవాబిచ్చాయి.

రాత్రికి రాత్రే మన సైనికులు చరిత్ర సృష్టించారు. అమాయక పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అశోకవనంలోకి వెళ్లినపుడు హనుమంతుడు ఏ నియమం పాటించాడో మేము కూడా అదే నియమం పాటిస్తున్నాం’ అని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మన త్రివిధ దళాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయన్నారు. అలాగే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.