26 May, 2026 | 4:56 PM

Breaking News

బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •  

ఆశావాహుల్లో టెన్షన్ రిజర్వేషన్లు మారుతాయా..? ఉంటాయా?

04-10-2025 12:00 AM

వలిగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఈనెల 8న తెలియజేయ నుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులలో రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించగా ఈ నెల 8న కోర్టు తెలియజేసే తీర్పుతో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు ఉంటాయా లేక మారుతాయా అనే ఉత్కంఠత సర్వత్ర నెలకొంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం లేకపోవడంతో ఆశావాహులు పోటాపోటీగా తమ నేతలను  ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణాలు ప్రారంభించి, దసరా సందర్భంగా తమ అనుచరగణాలకు విందులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.