14 August, 2026 | 8:25 PM

Breaking News

80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

13-07-2025 08:50 PM

పెన్ పహాడ్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం అనంతారంలో ఆదివారం చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తండా సైదులు(29) శనివారం రోజువారి పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లి పని ముగించుకుని ఆటోపై తన స్వగృహానికి తిరిగి వస్తుండగా అనంతారం గ్రామ శివారుకు రాగానే ఒక్కసారిగా పశువులు పొదల నుంచి రోడ్డుపైకి రావడంతో ఆటో డ్రైవర్ పశువులను తప్పించబోయిన క్రమంలో ఆటోలో ఉన్న మృతుడు సైదులు ప్రమాదశాత్తు కింద పడిపోయాడు. ఈ నేపథ్యంలో సైదులుకు తలకు బలమైన గాయాలు కావడంతో క్షతగాత్రుని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఉన్నారు. కాగా మృతిని తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.