14-10-2025 12:52:56 AM
హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది. మద్యం దుకాణాల కోసం టెండర్ దాఖలు చేసినప్పుడు చెల్లించిన మొత్తం ఆబ్కారీ శాఖకే వెళుతుందని, టెండర్ పొందని వారికి ఆ డబ్బు తిరిగి వచ్చేలా ఆదేశించాలని కోరుతూ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుముగా నిర్ణయించారని పిటిషన్లో పేర్కొన్నాడు.
ఒకవేళ లాటరీలో మద్యం షాపు దక్కకపోతే ఆ మొత్తం అబ్కారీ శాఖకే వెళ్తాయని, ఆ డబ్బును తిరిగిచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు. అలాగే లిక్కర్ పాలసీపై జారీ చేసిన జీవోను కూడా కొట్టివేయాలని కోరాడు. ఈ పిటిషన్కు స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఎక్సైజ్ శాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.