13-10-2025 12:36:15 AM
కామారెడ్డి టౌన్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని ఆరో వార్డు సరంపల్లి లో పైప్లైన్ పగిలిపోవడం తో నీరు రాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ మాజీ వాడు కౌన్సిలర్ ఆకుల రూప భర్త రవికుమార్ సరంపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ కు వెళ్లే పైపు లైన్ పగిలిపోవడంతో దానిని తీసివేసి కొత్త పైపు లైన్ ఏర్పాటు చేయించారు. దీంతో సరంపల్లి గ్రామస్తులకు నీటి సమస్య తీరిందని తెలిపారు.