27-11-2025 12:00:00 AM
తాడ్వాయి, నవంబర్, 26( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికైన వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. నాలుగు రోజులపాటు తాడ్వాయి మండల కేంద్రంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తున్నారు వారు రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడల పోటీలో పాల్గొంటారని కామారెడ్డి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు బాలు, స్వామి లు తెలిపారు.