15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించిన పోలీసులు

24-10-2025 12:04 AM

నార్సింగి/చేగుంట, అక్టోబర్ 23 : పోలీసుల అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా ఏటా నిర్వహించే పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నార్సింగి మండలంలో స్థానిక ఎస్‌ఐ బీమరి సృజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.  మండల పరిధిలోని శేరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఎస్‌ఐ సృజన, సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

పాఠశాలలోని 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణపై వ్యాస రచన పోటీలతో పాటు కబడ్డీ, రన్నింగ్, వాలీ బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ మిస్బాఉద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు జగన్నాథం, యాదగిరి, లింగం, రాజు, కన్వర్ కుమార్, వేణుగోపాల్, హెడ్ కానిస్టేబుల్, స్టేషన్ సిబ్బందిపాల్గొన్నారు.