17 June, 2026 | 11:00 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

దాబాలపై పోలీసుల దాడులు

30-10-2025 05:46 PM

మద్యం స్వాధీనం

కోటపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మహారాష్ట్ర శివారు గ్రామాలలో అనధికారికంగా నిర్వహిస్తున్న దాబాలపై పోలీసులు గురు వారం దాడులు నిర్వహించారు. లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా ధాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నెలల తరబడి దాబాలలో మద్యం అమ్ముతుండగా మామూళ్ళు అందకపోవడం వలన ప్రస్తుతం దాడులు జరిగాయని పలువురు చర్చించుకుంటున్నారు.