12 June, 2026 | 2:24 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

రాజగోపాల్‌పేటలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల చైతన్యం

24-01-2026 02:07 PM

నంగునూరు,విజయక్రాంతి: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పరిధిలోని రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌పేట నుండి పాలమాకుల వరకు పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు.వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అతివేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రాణాపాయం గురించి ఎస్ఐ వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.