9 April, 2026 | 7:14 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి

02-10-2025 12:50 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట అక్టోబర్ 1 (విజయక్రాంతి) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ విసి హాల్ లో   వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్, అభ్యర్థులు ఎన్నికలలో ఉపయోగించే వాహనాలు, మైక్ లు, భోజనాలు, ప్లెక్సీ, లేబర్ చార్జీలు, కరపత్రాలు, పోస్టర్లు,ఎల్  డి స్క్రీన్ లు తదితర అంశాలకు చెందిన వస్తువుల  ధరల వివరాలు రాజకీయ  పార్టీ నాయకులకు వివరించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో కొత్తగా ఎటువంటి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గ్రౌండింగ్ వంటివి ఉండవన్నారు.   

సోషల్  మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేసినచో  తగు చర్యలు  తీసుకోబడతాయన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల విషయంలో అందరు సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో రాజకీయ పార్టీల మీటింగులు, ర్యాలీల కొరకు అనుమతులు తీసుకోవాలని, ర్యాలీలను ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు వీడియో రికార్డులు చేస్తారని, అభ్యర్ధులు తమ ఖర్చులను ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్  కే సీతారామారావు, జడ్పీ సీఈవో వివి అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నుండి రాజేశ్వరరావు,బి ఆర్ ఎస్ నుండి బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బిజెపి నుండి ఎం డి హబీద్, సిపిఐఎం తరఫున కోట గోపి, , బిఎస్పీ నుండి స్టాలిన్,  సిపి ఐ నుండి బెజవాడ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు,జడ్పీ డిప్యూటీ సి ఈ ఓ శిరీష, డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.