15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఎన్నికల వేళ నోటీసుల రాజకీయం

30-01-2026 12:20 AM

బడంగ్‌పేట్, జనవరి 29: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే మాజీ సీఎం కేసీఆ్ప కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు, నోటీసుల డ్రామాలు ఆడుతోందని మహేశ్వరం నియోజకవర్గ బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును నిలదీశారు. అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన 420కి పైగా హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజల దృష్టిని మళ్లించడానికే ’ఫోన్ ట్యాపింగ్’ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు.

సిట్ అధికారుల ద్వారా కేసీఆర్కు నోటీసులు ఇప్పించడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన మండిప డ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి ’చిల్లర వేషాలు’ ఎన్నికల్లో సాగవని హెచ్చరించారు. కేసీఆర్ వెనుక తెలంగాణ సమా జం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.