9 April, 2026 | 11:07 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పోలింగ్ ప్రక్రియలో పీఓ, ఏపీఓలదే కీలక పాత్ర

02-10-2025 12:55 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 1:  స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పీఓ,ఏపీఓలదే కీలక పాత్రని,ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపీలు అన్నారు. బుధవారం మండలంలోని రామన్నగూడెం గ్రామ రైతువేదికలో పీఓ,ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదుర య్యేందుకు అవకాశం ఉంది. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, ఇట్టి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామకృష్ణ, శిక్షకులు వి సైదులు, పి మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్ శిల్పిక, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, రాజశేఖర్, నారాయణమూర్తి, రమేష్, పీఓలు, ఏపీవోలు పాల్గొన్నారు.