calender_icon.png 2 September, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణితో సమస్యల పరిష్కారం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

01-09-2025 10:10:06 PM

మొత్తం 126 దరఖాస్తుల రాక

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి.

రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, డీఆర్డీఓకు 10, జిల్లా విద్యాధికారికి 9, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 7 చొప్పున, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి 5, ఎస్డీసీ, ఎస్పీ ఆఫీస్ కు 4 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, సెస్ కార్యాలయానికి 3 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఏ డీ ఎస్ ఎల్ ఆర్, జిల్లా ఉద్యానవన అధికారికి రెండు చొప్పున, జిల్లా వైద్యాధికారి, ఈఈ మిషన్ భగీరథ, సబ్ రిజిస్టర్ సిరిసిల్ల, ఈఈ పీఆర్, డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆఫీస్, ఎంపీడీఓ తంగళ్ళపల్లి, ఇల్లంతకుంటకు ఒకటి చొప్పున వచ్చాయి.