20 March, 2026 | 10:00 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు కసరత్తు

15-01-2026 03:16 AM

121 మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక లకు పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగా బుధవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల సంఖ్యను ప్రకటించింది. మున్సి పాలిటీల్లో జనరల్ 30, మహిళా జనరల్ 31, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19 స్థానాలు కేటాయించారు. ఇక పది కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, జనరల్ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ మహిళ 1 స్థానాలకు కేటాయించా రు. ఈ నెల 17న రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు చేయగా, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ స్థానాలు ఖరారు చేశారు.