15-01-2026 03:13:28 AM
హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం 11డిగ్రీల నుంచి 17 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా చలి తీవ్రత గతంలో కంటే కాస్త తగ్గుముఖం పట్టింది. రాను న్న ఒకట్రెండు రోజులు వాతావరణ మార్పులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవా రం ఒక ప్రకటన విడుదల చేసింది.