17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

23-12-2025 12:00 AM

ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ,  సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మేడ్చల్, డిసెంబర్ 22 సిటీబ్యూరో (విజయక్రాంతి): ఆరు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము శీతాకాల విడిదిని ముగించుకుని సోమవారం ఢిల్లీకి వెళ్లారు. హకీంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రేవంత్‌రెడ్డి జ్ఞాపికను అందజేశారు.

మంత్రి సీతక్క, ప్రభు త్వ సలహాదారు వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి  కలెక్టర్ మనుచౌదరి, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. శీతాకాల విడదికి ఈనెల 17న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ముర్ము ఆరు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.