6 May, 2026 | 7:58 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

చికిత్స కంటే నివారణే ఉత్తమం

01-07-2025 02:42 AM

శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): చికిత్స కంటే నివారణే ఉత్తమం, సురక్షితం అని శ్వాస ఫౌండేషన్ చైర్మన్(శ్వాస హాస్పిటల్) డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని అన్నారు. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆయన గొప్ప వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు.

ఈ సందర్భంగా డాక్టర్ విష్ణున్‌రావు మాట్లాడుతూ.. శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు సాధికారతనిస్తూ, వైద్యులకు మద్దతునిస్తూ, ఆరోగ్యం హక్కు కాదు ఆచరణ కావాలి అనే దిశ గా కార్యాచరణ చేపడుతున్న ట్టు వెల్లడించారు.

వైద్యుల గురించి మా ట్లాడుతూ.. భారతదేశంలో వైద్యులు కేవలం రోగ నిరోధకులు , చికిత్సలు చేసే వారు మాత్రమే కాదు వారు సమాజ శ్రేయస్సు కోసం నిలబడాల్సిన మూల స్తంభాలు , విద్యావేత్తలు, మార్పు కాంక్షించే వ్యక్తులు అని కొనియాడారు. వైద్యులు, పాలకులు, ఎన్జీవో సం ఘాలు, ప్రజలు అందరూ కలిసి నిర్మించేదే ఆరోగ్యవంతమైన సమాజం అని చెప్పారు.