17 June, 2026 | 11:34 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

నిబంధనల మేరకు ఎరువులు అందించండి

02-10-2025 12:00 AM

ఆగ్రో రైతు సేవా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి

చిన్న చింత కుంట అక్టోబర్ 1 : నిబంధనలు మేరకు రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మండల కేంద్రం లో  ఆగ్రో రైతు సేవా కేంద్రం-2 ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి  తనిఖీ చేశారు.యూరియా, ఎరువుల స్టాక్ రిజిస్టర్  పరిశీలించారు. పంపిణీ సక్రమంగా  జరుగుతుందా తెలుసు కున్నారు.  రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని సూచించారు.

ఆగ్రో రైతు సేవా కేంద్రం ద్వారా యూరియా, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని  స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు,  జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్,మండల వ్యవసాయ అధికారి,తదితరులు ఉన్నారు.