27-01-2026 11:22:23 PM
అలంపూర్ జనవరి, 27: ఇటిక్యాల మం డలం వేముల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కూతురు చిన్నారి యామిని (4) క్యా న్సర్ బారిన పడి కర్నూల్ లోని విశ్వ భారతి క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న అజయ్ సేవాదళం సభ్యులు మంగళవారం ఆసుపత్రి లో చిన్నారిని పరామర్శించి రూ. పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమం లో వడ్డేపల్లి మాజీ జెడ్పిటిసి కాశపోగు రా జు, సురేష్, అజయ్ సేవాదళం అధ్యక్షులు మతిన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.