22-12-2025 01:12:18 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్
ములుగు, డిసెంబర్21(విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పం చాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎ న్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తా త్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.