17 April, 2026 | 9:41 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

పుల్లూరుబండ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవం

12-05-2025 12:32 AM

సిద్దిపేట, మే 11(విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం నరసింహ జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రహ్లాదుని ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు నరసింహ స్వామి రూపంలో ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశి పున్ని సంహరించినరోజు నరసింహ జయంతిగా నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.

ఆలయం వంశపారంపర్య అర్చకులు  కలకుంట్ల రంగాచార్య, పొడిచేటి శ్రీనివాసా చార్య, పొడిచేటి రామకృష్ణ, కోయిల్ కాందాలై అచ్యుత్, కలకుంట్ల వెంకట్, కలకుంట్ల నచికేత, సంపన్ ముడుంబై రుత్విక్, సాయి కృష్ణ ల ఆధ్వర్యంలో ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, స్వయాభూ లక్ష్మీ నరసింహ స్వామికి నవకళశ అభిషేకం, సుదర్శన నరసింహ హోమం, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల సుమా రంగాచార్యులు, గ్రామ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, ఉడుత మల్లేశం, కోడూరి శ్రీనివాస్, ఉడుత రవి పాల్గొన్నారు.