24 August, 2026 | 10:23 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంపీడీవో రాజేశ్వర్

12-09-2025 11:49 PM

మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత నాణ్యమైన విద్య అందుబాటు లో ఉంటుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్యను సద్విని యోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ కోరారు. మండలం లోని బొక్కలగుట్ట ప్రాథమిక ఉన్నత పాఠశాల లోని విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని విద్యార్థులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు పుస్తకాలు విద్యాబోధన మధ్యాహ్న భోజనం పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని అంతేకాకుండా అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.