14-10-2025 12:02:15 AM
పదర అక్టోబర్ 13 : గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎమ్మెల్యే వంశీకృష్ణ విజయానికి కృషిచేసానంటూ పదర మండల అధ్యక్షులు ఏడుపుల రామలింగయ్య యాదవ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు.
ఏఐసీసీ, ఎన్నికల ఇన్చార్జి, పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ప్రతినిధులకు దరఖాస్తుతో పాటు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. పార్టీకి అంకితం భావంతో పనిచేస్తూ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ వరకు సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి లభిస్తే పార్టీకి మరింత శక్తివంతమైన నాయకత్వం లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.