14 July, 2026 | 7:21 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

నిరుపేద ఆత్మగౌరవ ప్రతీక రేషన్ కార్డు

23-07-2025 12:18 AM

ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 

నాగర్ కర్నూల్ జూలై 22 (విజయక్రాంతి)నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా వారి ఆత్మగౌరవ ప్రతీకగా రేషన్ కార్డు నిలుస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వం శీకృష్ణ అన్నారు. మంగళవా రం నియోజకవర్గంలోని వం గుర్ మండలం మిట్ట సద్దగోడు గ్రామంలో మంగళవా రం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం నిరుపేదల హార్దిక అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే సన్నబియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అనంతరం వంగూరు నుండి వెలమల పల్లె గ్రామానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులుఉన్నారు.