calender_icon.png 26 January, 2026 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 11:32:48 AM

కామారెడ్డి, జనవరి 26(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ మధుసూదన్ రావు, ఎక్సైజ్ ఎస్ ఐ దీపిక , పోలీసు సిబ్బంది, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.